జగన్ రాక్షసానందం కోసమే రైతులకు బేడీలు వేశారు: నిమ్మల

ABN , First Publish Date - 2020-10-28T17:14:49+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో రైతు కష్టాలు నారా లోకేష్ బహిర్గతం చేస్తుంటే ప్రభుత్వం భరించలేక పోతుంది. రైతులకు సంకెళ్లు వెయ్యడం రైతు ప్రభుత్వమా? జగన్ రాక్షసానందం కోసమే

జగన్ రాక్షసానందం కోసమే రైతులకు బేడీలు వేశారు: నిమ్మల

ఏలూరు: వైసీపీ ప్రభుత్వంపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో రైతు కష్టాలు నారా లోకేష్ బహిర్గతం చేస్తుంటే ప్రభుత్వం భరించలేక పోతుంది. రైతులకు సంకెళ్లు వెయ్యడం రైతు ప్రభుత్వమా? జగన్ రాక్షసానందం కోసమే రైతులకు బేడీలు వేశారు. గడ్డి తినే పశువులు రైతులపై విశ్వాసం చూపుతుంటే.. అన్నం తినే మంత్రులు మాత్రం విద్వేషం కక్కుతున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏం కడతారు? పాత్రికేయులతో మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏమి పాలిస్తారు?’ అని నిమ్మల రామానాయుడు నిలదీశారు.

Updated Date - 2020-10-28T17:14:49+05:30 IST