టిడ్కో ఇళ్లు అప్పగించాలని వార్డు సత్యాగ్రహ దీక్షలు
ABN , First Publish Date - 2021-12-09T05:51:56+05:30 IST
గత ప్రభుత్వ హయాం లో నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అప్ప గించాలని త్వరలో వార్డుల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్న ట్టు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు.
పాలకొల్లు అర్బన్, డిసెంబరు 8 : గత ప్రభుత్వ హయాం లో నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అప్ప గించాలని త్వరలో వార్డుల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్న ట్టు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో గత టీడీపీ హయాంలో 7,139 ఇళ్లు మంజూరు చేసి 2019 ఎన్నికల నాటికే 85 శాతం పూర్తి చేశామన్నారు. ప్రభుత్వం మారడంతో రెండున్నరేళ్లుగా ఆ ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయ లేదన్నారు.ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వా లని ‘నా ఇల్లు – నాసొంతం’ పేరుతో ఉద్యమాన్ని చేపడతామని తెలి పారు. ఇళ్ళ ను బ్యాంక్ రుణాల్లేకుండా స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.