అవన్నీ అవాస్తవాలే.. గోరంట్ల
ABN , First Publish Date - 2020-02-16T20:05:50+05:30 IST
పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ శాఖ ఇచ్చిన పంచనామా నివేదికపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
హైదరాబాద్: పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సోదాలపై ఐటీ శాఖ ఇచ్చిన పంచనామా నివేదికపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఐటీ శాఖ నివేదికతో ఆరోపణలన్నీ అవాస్తాలని తేలిపోయిందన్నారు. ఇక తన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది కాబట్టే... వివేకా హత్యకేసులో జగన్ సీబీఐ విచారణ జరిపించడం లేదన్నారు. హోదాపై ప్రజలకు వివరించాకే.. ఎన్డీయేలో వైసీపీలో చేరాలన్నారు. కేసుల నుంచి బయట పడేందుకే ఎన్డీయేలో చేరాలనుకుంటున్నారని విమర్శించారు. రాజ్యసభలో బలంలేని కారణంగా వైసీపీ మద్దతు కోసం బీజేపీ చూస్తోందన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ను రక్షించేందుకు జగన్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. నేరం రుజువైతే గల్ఫ్ దేశాల్లో ఉన్న నిమ్మగడ్డకు కఠిన శిక్ష తప్పదన్నారు. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్ వ్యాపారాలపై కూడా విచారణ జరపాలన్నారు.