వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2022-09-29T05:09:00+05:30 IST
ఒక్క చాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంశాన్ని మర్చిపోయారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు.
ఎమ్మెల్యే రామరాజు
కాళ్ళ, సెప్టెంబరు 28 : ఒక్క చాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంశాన్ని మర్చిపోయారని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలంటూ కాళ్ళకూరులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అడ్డాల శివరామరాజు, జీవీ.నాగేశ్వరరావు, తోట ఫణిబాబు, బండారు వేణుగోపాలరావు, గేదల జాన్, వీరవల్లి శ్రీనివాస్, వేగేశ్న సత్యనారాయణరాజు, అడ్డాల గణపతిరాజు, గుల్లిపల్లి జోగయ్య, కందుకూరి వీరరాఘవులు, పాల్గొన్నారు.