టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి : అబ్రహం

ABN , First Publish Date - 2022-05-22T06:45:52+05:30 IST

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ నేత, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు.

టీడీపీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి : అబ్రహం
టీడీపీ కార్యకర్తకు పార్టీ సభ్యత్వ రశీదును అందిస్తున్న సివేరి అబ్రహం


హుకుంపేట, మే 21(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని టీడీపీ నేత, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అన్నారు. మండలంలో దాలిగుమ్మడి గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, లక్ష్యం మేరకు నమోదు చేపట్టాలన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలన్నారు. గడపగడపకు కార్యక్రమానికి వస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులను నిలదీసేలా ప్రజల్ని ఛైతన్యం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు శెట్టి లక్ష్మణుడు, తులసీరావు, కామేశ్వరరావు, కొమ్మా రమా, సత్యానందం, అప్పలస్వామి, సురేశ్‌, ఈశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:45:52+05:30 IST