టీడీపీ వైద్య విభాగం విరాళం 5 లక్షలు
ABN , First Publish Date - 2020-03-29T08:30:30+05:30 IST
రాష్ట్రంలో కరోనాపై యుద్ధానికి తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం మద్దతుగా నిలుస్తుందని విభాగం అధ్యక్షుడు దోనెపూడి పవన్ శనివారం ఓ ...
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనాపై యుద్ధానికి తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం మద్దతుగా నిలుస్తుందని విభాగం అధ్యక్షుడు దోనెపూడి పవన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ విభాగం తరుఫున సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.