నేటి నుంచి టీడీపీ మహానాడు

ABN , First Publish Date - 2020-05-27T07:36:30+05:30 IST

తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం ప్రారంభం కానుంది. రెండురోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా ఈసారి మహానాడు...

నేటి నుంచి టీడీపీ మహానాడు

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా నిర్వహణ


హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడు బుధవారం ప్రారంభం కానుంది. రెండురోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వెబ్‌నార్‌ ద్వారా ఈసారి మహానాడు నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సుమారు 15 వేల మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. వీరిలో తెలంగాణ నుంచి ఐదువేల మంది పాల్గొంటారని టీడీపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణాకు సంబంధించి మొత్తం 12 తీర్మానాలు ప్రతిపాదించనుండగా తెలంగాణ నుంచి 4 అంశాలపై చర్చించనున్నారు. తొలిరోజు వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై, గురువారం విద్యారంగం, టీఆర్‌ఎస్‌ వాగ్దానాలు-వైఫల్యాలపై చర్చించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు  ప్రారంభమయ్యే మహానాడులో టీడీపీ -టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఉదయం 11.50 గంటలకు ప్రసంగించనున్నారు.


Updated Date - 2020-05-27T07:36:30+05:30 IST