దక్షిణాఫ్రికాలో ఘనంగా TDP ‘మహానాడు’ వేడుకలు!
ABN , First Publish Date - 2022-05-15T23:42:08+05:30 IST
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయన నేపథ్యంలో టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని టీడీపీ ఎన్ఆర్ఐ శాఖ దక్షిణాఫ్రికాలో మే 14న మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని టీడీపీ ఎన్ఆర్ఐ శాఖ దక్షిణాఫ్రికాలో మే 14న మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించింది. జోహనేస్బర్గ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ నుంచి మాజీ మంత్రివర్యులు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ జవహర్, తెలుగుదేశం జనరల్ సెక్రెటరీ శ్రీమతి గౌతు శిరీష ప్రత్యేకంగా హాజరయ్యారు. దక్షిణాఫ్రికాలోని వివిధ నగరాల నుంచి టీడీపీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ జన్మభూమి విధానానికి కొనసాగింపుగా GFST గ్లోబల్ ఫారం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని అందరూ ముందుకు నడిపించాలని పేర్కొంటూ NRI TDP సభ్యత్వాలు మీద తీర్మానం ప్రవేశ పెట్టారు.
జవహర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఎన్నారై టీడీపీ కార్యకర్త రానున్న ఎన్నికల్లో పార్టీకి అందుబాటులో ఉండాలని కోరారు. పార్టీ కూడా ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ టీడీపీ సమస్యల మీద స్పందిస్తుందని తెలియజేశారు. NRITDP ని బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా పార్టీ సంసిద్ధంగా ఉన్నదని చెప్పారు. భవిష్యత్తులో పార్టీ చేయబోయే సహకారాలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా.. తన ఆసక్తికర కథలతో జవహర్ సభను రక్తికట్టించారు.
ఈ సమావేశంలో NRI TDP Cell ఇంఛార్జి చప్పిడి రాజ శేఖర్ zoom ద్వారా మాట్లాడుతూ ఈ విభాగం విధి విధానాలను వివరించారు. NRI TDPలో ప్రజలు తమ సభ్యత్వాలను నమోదు చేసుకోవలసిందిగా కోరారు. అదే zoomలో కొవ్వూరు నుండి దివ్యంగురాలు లావణ్య లక్షి మాట్లాడుతూ తెలుగుదేశం అధికారం లోకి ఎందుకు రావాలో దానికి తానే ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు రామకృష్ణ పార మాట్లాడుతూ గతంలో ఎన్నో రకాల సదుపాయాలు ప్రభుత్వాలు అందజేయగా ఇప్పటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు సౌకర్యాలు కల్పించడంలో ముందు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని మురళి గుమ్మడి శ్రీరాములు ఇందిరా, రాధా మోహన్, ఆనంద్ మరియు NRI TDP సౌత్ ఆఫ్రికా కౌన్సిల్ మెంబర్లతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.