Ap News: టీడీపీ మహానాడు తీర్మానాలు ఇవే...

ABN , First Publish Date - 2022-05-27T04:19:38+05:30 IST

టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్రపై చర్చంచారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానంపైనా..

Ap News: టీడీపీ మహానాడు తీర్మానాలు ఇవే...

ప్రకాశం: టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్రపై చర్చించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానంపైనా చర్చించారు.  టీడీపీ, ఎన్టీఆర్ గొప్పతనంపై ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులో 16 తీర్మానాలు ప్రవేశపెట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. 12 ఏపీ, 3 తెలంగాణ, ఒకటి అండమాన్‌కు సంబంధించిన తీర్మానాన్ని మహానాడులో పెట్టనున్నారు. తీర్మానాలపై చర్చల్లో యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.  9 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కరూ లేరని, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు జగన్ సహ నిందితులు ఉన్నారని, ముగ్గురు ఇతర రాష్ట్రాల వాళ్లు ఉన్నారని,  ఇదెక్కడి సామాజిక న్యాయమని పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రశ్నించారు. 


Updated Date - 2022-05-27T04:19:38+05:30 IST