TDPలో సంస్థాగతంగా సంచలన మార్పులు: లోకేష్

ABN , First Publish Date - 2022-05-27T23:10:04+05:30 IST

టీడీపీ (TDP)లో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు.

TDPలో సంస్థాగతంగా సంచలన మార్పులు: లోకేష్

అమరావతి: టీడీపీ (TDP)లో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రకటించారు. టీడీపీ మహానాడులో లోకేష్ మాట్లాడుతూ వరుసగా మూడుసార్లు ఓడిన వారికి టికెట్‌ ఇవ్వమని తెలిపారు. పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే.. ఆ తర్వాత బ్రేక్ తీసుకోవాల్సిందేనన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి బ్రేక్ తీసుకుంటానని లోకేష్‌ తెలిపారు. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే కొత్త రక్తం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. ఇది తన బలమైన కోరిక అని.. ఇదే విషయంపై పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించానని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా కొంత మంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు. పని చేయని నేతలకు, ఇన్‌చార్జ్‌లకు అవకాశాలుండవని లోకేష్‌ తేల్చిచెప్పారు.

Updated Date - 2022-05-27T23:10:04+05:30 IST