రైతుల బీమా సొమ్ము మింగేసిన అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2022-06-28T06:08:22+05:30 IST

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం పంపిణీలో ఆలమూరు మండలంలో జరిగిన అక్రమాల్లో దగాపడ్డ రైతులను ఆదుకోవాలని, బీమా సొమ్ము మింగేసిన అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు.

రైతుల బీమా సొమ్ము మింగేసిన అక్రమార్కులను కఠినంగా శిక్షించాలి
జాయింట్‌ క లెక్టర్‌ ధ్యానచంద్రకు అర్జీ ఇస్తున్న సత్యానందరావు

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రామచంద్రపురం, జూన 27: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం పంపిణీలో ఆలమూరు మండలంలో జరిగిన అక్రమాల్లో దగాపడ్డ రైతులను ఆదుకోవాలని, బీమా సొమ్ము మింగేసిన అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన స్పందనలో ఆయన జాయింట్‌ కలెక్టర్‌ ధ్యానచంద్రకు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అవినీతి వ్యవహారంపై విజిలెన్స కమిటీ వేసి పూర్తి విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలన్నారు. రైతు భరోసా కేంద్రం ఉద్యోగులను మాత్రమే బాధ్యులను చేసి అక్రమాలకు పాల్పడ్డ అధికార పార్టీ నేతలను వదిలేయడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో రైతులు ఈదల సత్తిబాబు, వంటిపల్లి సతీ్‌ష్‌, ఈదల నల్లబాబు, కంఠంశెట్టి శ్రీను, సీహెచ భాస్కరరావు, జి.బాబి, డి.రామారావు, వైట్ల శేషుబాబు, మానేపల్లి శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T06:08:22+05:30 IST