Dhulipallaపై ఏపీ ప్రభుత్వం మరో అస్త్రం

ABN , First Publish Date - 2021-10-27T14:10:25+05:30 IST

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది.

Dhulipallaపై ఏపీ ప్రభుత్వం మరో అస్త్రం

అమరావతి: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రపై ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. పాల రైతులకు ఉపయోగపడుతున్న దూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సిక్స్ ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.  దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్ ఈ నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. డీవీపీ ట్రస్టు ద్వారా డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది.  పాల రైతులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం డబ్బులకి వైద్యం అందిస్తూ డీవీసీ ఆసుపత్రి పేరుగాంచింది. గతంలో సంగం డైరీ స్వాధీనానికి ప్రయత్నం చేసి కోర్టు కొట్టి వేయటంతో చేతులు ముడుచుకున్న సర్కార్...తాజాగా డీవీసీ ట్రస్ట్, డీవీసీ ఆసుపత్రిపై మళ్లీ నోటీసులు పర్వం ప్రారంభమైంది.  

Updated Date - 2021-10-27T14:10:25+05:30 IST