పోలవరంపై నిర్లక్ష్య వైఖరి: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2022-02-24T01:58:26+05:30 IST
పోలవరం ప్రాజెక్ట్పై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తోందని టీడీపీ
కృష్ణా: పోలవరం ప్రాజెక్ట్పై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మైలవరంలోని టీడీపీ కార్యాలయంలో పోలవరం పై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 నెలల నుంచి ప్రాజెక్ట్ పనులను పెండింగ్లోనే పెట్టారన్నారు. 151 అడుగులతో కట్టాల్సిన ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని తగ్గించి ప్రజలను వరదల్లో ముంచుతున్నారన్నారు. నిధుల విషయంపై కేంద్రంతో ఎందుకు లాలూచి పడుతున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ, వివేకా హత్య కేసులో అవినాష్ను తప్పించేందుకే పోలవరం నిధులను వైసీపీ ప్రభుత్వం పణంగా పెట్టిందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులను 71 శాతం పూర్తి చేశాంమని ఆయన పేర్కొన్నారు. టీడీపీపై కక్షతోనే పోలవరం పనుల నిలుపుదల చేసిందన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ద్రోహిగా మారిందని ఆయన అన్నారు.