వైసీపీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటా..: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2022-02-18T02:42:40+05:30 IST

వైసీపీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని టీడీపీ నేత

వైసీపీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటా..: దేవినేని ఉమ

కృష్ణా: వైసీపీ అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని టీడీపీ నేత దేవినేని ఉమ తేల్చి చెప్పారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించినా, ప్రజల కోసం దేనికైనా సిద్ధమని, వెనక్కు మాత్రం తగ్గేదే లేదన్నారు. జి. కొండూరు మండలంలో మీడియాతో ఆయన మాట్లాడారు.  నియోజకవర్గానికి కొండపల్లి, గొల్లపూడి, మైలవరంలో బార్ అండ్ రెస్టారెంట్లు అనే మూడు భారీ పరిశ్రమలను  ఎమ్మెల్యే వసంత తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. కమీషన్ల కక్కుర్తి కోసమే వీటిని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఒక్క లిఫ్ట్ పెట్టిన పాపాన పోలేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా ముందుకు తీసుకు వెళ్ళ లేకపోయారని ఆయన మండిపడ్డారు. ఒక చేత్తో బియ్యం ఇస్తూ, ఇంకో చేత్తో అమ్ముకొని గోదాముల్లో స్టాక్ పెడుతున్నారన్నారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలించి మంత్రులు, ఎమ్మెల్యేలు, దళారులు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2022-02-18T02:42:40+05:30 IST