మహాపాదయాత్రను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం: టీడీపీ

ABN , First Publish Date - 2021-11-07T18:33:48+05:30 IST

రైతుల మహాపాదయాత్రను పోలీసులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని టీడీపీ నేతలు అన్నారు.

మహాపాదయాత్రను అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం: టీడీపీ

గుంటూరు: రాజధాని రైతుల మహాపాదయాత్రను పోలీసులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని టీడీపీ నేతలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రకు వస్తున్నారని, ప్రజాధరణ చూసి వైసీపీ ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. వైసీపీకి వర్తించని కొవిడ్ నిబంధనలు మహాపాదయాత్రకే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-11-07T18:33:48+05:30 IST