ఎస్పీని కలిసిన టీడీపీ నాయకులు

ABN , First Publish Date - 2022-05-17T05:55:30+05:30 IST

నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఈనెల 18, 19వ తేదీల్లో పర్యటించనున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భద్రత కల్పించాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డికి టీడీపీ నాయకులు వినతిపత్రాన్ని అందించారు.

ఎస్పీని కలిసిన టీడీపీ నాయకులు

చంద్రబాబు పర్యటనకు భద్రత కల్పించండి 

నంద్యాల ఎస్పీని కలిసిన టీడీపీ నాయకులు 


నంద్యాల (నూనెపల్లె), మే 16 : నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఈనెల 18, 19వ తేదీల్లో పర్యటించనున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు  భద్రత కల్పించాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డికి టీడీపీ నాయకులు వినతిపత్రాన్ని అందించారు. సోమవారం సాయంత్రం నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి నేతృత్వంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ తదితరులు ఎస్పీని కలిశారు.  18, 19 తేదీల్లో వివిధ కార్యాక్రమాల్లో మాజీ సీఎం పాల్గొననున్నందున  భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీసీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే సుభిక్షంగా ఉంటామన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మణియార్‌ ఖలీల్‌, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:55:30+05:30 IST