వెలిగొండ ప్రాజెక్టు సొరంగంలో టీడీపీ నేతల పర్యటన
ABN , First Publish Date - 2021-07-28T02:17:32+05:30 IST
వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలోకి లీకేజీలతో ప్రవహిస్తున్న వరద నీటిని తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలోకి లీకేజీలతో ప్రవహిస్తున్న వరద నీటిని తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టు వద్దకు చేరుకుని ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం, దర్శి ఇన్ఛార్జ్లు ఎరిక్షన్ బాబు, పమిడి రమేష్లు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండక ముందే వెలిగొండ టన్నెల్లోకి నీరు రావటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పనుల పర్యవేక్షణ లోపంతో పాటు నాణ్యత లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి అన్నారు.