దేవిశెట్టిపల్లిలో ‘బాదుడే బాదుడు’

ABN , First Publish Date - 2022-05-16T03:51:04+05:30 IST

మండలంలోని దేవిశెట్టిపల్లి, నాగరాజుపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం టీడీపీ మండల అధ్యక్షుడు కప్పా ప్రభాకర్‌రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

దేవిశెట్టిపల్లిలో ‘బాదుడే బాదుడు’
కరపత్రాలు పంపిణీ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు

సీతారామపురం, మే 15 : మండలంలోని దేవిశెట్టిపల్లి, నాగరాజుపల్లి గ్రామాల్లో ఆదివారం సాయంత్రం టీడీపీ మండల అధ్యక్షుడు కప్పా ప్రభాకర్‌రాజు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్‌ అసమర్ధ పాలన, అరాచకత్వంతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ పెరిగిన విద్యుత్‌, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరల నియంత్రణ లేకపోవడం, రాష్ట్రంలో పెరుగుతున్న అఘాయిత్యాలే అందుకు నిదర్శనమన్నారు. అనంతరం గ్రామాల్లో నిరసన ర్యాలీ నిర్వహించి వైసీపీ అక్రమ పాలనను తెలుపుతూ ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బారావు, మహాలక్ష్మయ్య, నల్లి రామయ్య, రమణయ్య, శ్రీనివాసులు, పెద్దగౌస్‌, రమేష్‌, విజయ్‌, కిరణ్‌, రాజేష్‌, జయరాములు, వినోద్‌ఖన్నా, ఆనంద్‌, జీవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T03:51:04+05:30 IST