బాధిత కుటుంబాలకు టీడీపీ నాయకుల పరామర్శ
ABN , First Publish Date - 2021-10-19T06:07:22+05:30 IST
మండలంలోని మల్లేపల్లికి చెందిన టీ డీపీ నాయకుడు సూర్యనారాయణ యాదవ్ నీటిలో పడి మృతి చెందాడు.
పెద్దవడుగూరు, అక్టోబరు 18: మండలంలోని మల్లేపల్లికి చెందిన టీ డీపీ నాయకుడు సూర్యనారాయణ యాదవ్ నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి సోమవారం గ్రా మానికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అండగా ఉంటానని వారికి భరోసా ఇ చ్చారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, గం గరాజుయాదవ్, బాల్రెడ్డి, ప్రసాద్యాదవ్, చిరంజీవులు ఉన్నారు.
పామిడి: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ సీనియర్ కార్యకర్త సూర్యనారాయణయాదవ్ మృతి పట్ల టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడుయాదవ్ సోమవారం నివాళులర్పించారు. పెద్దవడుగూరు మండలం మల్లేపల్లికి చెందిన సూర్యనారాయణ యాదవ్ హఠాన్మరణం పార్టీకి తీరని లో టు అన్నారు. మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కు టుంబ సభ్యులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో నాయకులు మొలక రామాంజనేయులు, వేల్పుల గంగరాజు, పవన, నరేష్, కదిరిపల్లి మాజీ సర్పంచ డీ ప్రసాద్, సూరప్ప, నరేంద్రబాబు, నాగరాజు ఉన్నారు.
కుందుర్పి: స్థానిక టీడీపీ కార్యకర్త కుందుర్పయ్య కుటుంబానికి అండ గా ఉంటామని పార్టీ సీనియర్ నాయకులు చౌళం మల్లికార్జున, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన చౌదరి, తెలుగురైతు రాష్ట్ర కార్యద ర్శి అమిలినేని లక్ష్మినారాయణచౌదరి, అనంతపురం పార్లమెంట్ ఉపాధ్యక్షు లు వైపీ రమే్ష భరోసా ఇచ్చారు. మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్త కుందుర్పయ్య కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విష యం తెలుసుకున్న నాయకులు సోమవారం బాధితున్ని పరామర్శించారు. రూ.10వేలు ఆర్థిక సాయం అందించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన గౌని శ్రీనివాసరెడ్డి, స ర్పంచు లాల్కృష్ణ, ఊటంకి రామాంజనేయులు, రాజశేఖర్చౌదరి, బసవరా జు, వెలుగు లోకేష్, హనుమంతరెడ్డి, రామాంజనేయులు, నారాయణస్వా మి, తాహీర్, ఎల్ఐసీ తిప్పేస్వామి, వైబీ ఓబయ్య, ఓబుళపతి, కిష్టప్ప, ఇం తియాజ్, నాగరాజు, చెలిమప్ప పాల్గొన్నారు.