మహానాడుకు తరలివెళ్లిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-05-27T05:45:39+05:30 IST

ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు సభలకు కలిదిం డి నుంచి టీడీపీ మండల నాయకులు ఏడు కార్లలో గురువారం తరలివెళ్లారు.

మహానాడుకు తరలివెళ్లిన టీడీపీ నేతలు
మహానాడుకు వెళ్తున్న టీడీపీ కలిదిండి నాయకులు

కలిదిండి/ముదినేపల్లి రూరల్‌, మే 26 : ఒంగోలులో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడు సభలకు కలిదిం డి నుంచి టీడీపీ మండల నాయకులు ఏడు కార్లలో గురువారం తరలివెళ్లారు. టీడీపీ మండల అధ్యక్షుడు పోకల జోగిరాజు, మార్కెట్‌ యార్డు మాజీ చైౖర్మన్లు వల్లభనేని శ్రీనివాస్‌చౌదరి, తాడినాడ బాబు, కురెళ్ల ఏడుకొండలు, సీతారామాంజనే యులు, ఇమ్మానేని శేఖర్‌, భోగేశ్వరరావు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్‌ గ్రామాల్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో మహానాడుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం ముదినేపల్లిలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం భారీ సంఖ్యలో కార్ల ర్యాలీగా ఒంగోలు తరలివెళ్లనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లోని యువత, రైతులు సొంత వాహనాలపై తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-05-27T05:45:39+05:30 IST