టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు

ABN , First Publish Date - 2020-09-21T19:31:41+05:30 IST

టీడీపీ నేతలపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న అలిపిరి వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు

తిరుపతి: టీడీపీ నేతలపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న అలిపిరి వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్‌తో పాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ సహా మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ 341, 188, రెడ్ విత్ 34 ఐసీపీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2020-09-21T19:31:41+05:30 IST