పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేతల నిరసన
ABN , First Publish Date - 2020-05-24T09:25:26+05:30 IST
సామాజక మాధ్యమాల్లో మంత్రి అనిల్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ విడవలూరు టీడీపీ కార్యకర్త సత్యం రెడ్డిను బాలాజీనగర్ ..
నెల్లూరు(క్రైం),మే 23: సామాజక మాధ్యమాల్లో మంత్రి అనిల్కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ విడవలూరు టీడీపీ కార్యకర్త సత్యం రెడ్డిను బాలాజీనగర్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శనివారం టీడీపీ నాయకులు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ప్రఽధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎస్పీని ఏక వచనంతో సంబోధించి దమ్ముంటే అరెస్ట్ చేసుకో అన్న అధికార పార్టీ ఎమ్మెల్యేపైనా, ఒక ఏఎస్ఐ చేతిలో ఫోన్ లాక్కొని నోటికి వచ్చినట్లు తిట్టిన ఎమ్మెల్యేపైనా చర్యలు లేవన్నారు.
మంత్రి అనిల్కుమార్ యాదవ్కు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెట్టారని వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే గంటల వ్యవధిలో అరెస్ట్ చేయడాన్ని ఏమంటారో పోలీసులే చెప్పాలని ప్రశ్నించారు. సత్యం రెడ్డిపై అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్కడ సీఐ లేకపోవడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న చిన్నబజారు పోలీసు స్టేషన్ సీఐ మధుబాబుకు నేతలు రెండు ఫిర్యాదులు ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్ఎ్సఎ్ఫ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు, ప్రధాన కార్యదర్శి అమృల్లా, నాయకులు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్, హనుమంతురావు, సాయి, కిషోర్ గడ్డం మహేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.