‘వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవు’

ABN , First Publish Date - 2021-03-01T18:30:45+05:30 IST

నెల్లూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

‘వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవు’

నెల్లూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబును ఎదుర్కొనే దమ్ములేక నిర్బంధం చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు తిరుపతి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తిరుపతిలో చంద్రబాబు పర్యటిస్తే మునిసిపల్ ఎన్నికల్లో గెలవడం కష్టమనే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ అరాచకాలు ఎక్కువ రోజులు సాగవని.. త్వరలోనే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2021-03-01T18:30:45+05:30 IST