పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2022-07-02T04:55:17+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య ఆధ్వర్యాన నాయకులు శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
బుచ్చిరెడ్డిపాలెం, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మండల అధ్యక్షుడు ఎంవీ.శేషయ్య ఆధ్వర్యాన నాయకులు శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ అధికార ప్రతినిధి సీహెచ్ కృష్ణచైతన్య మాట్లాడుతూ బుచ్చి నగర పంచాయతీలో అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారని ఆరోపించారు. విచారణ జరిపి అర్హులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దారు శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రభాకర్రెడ్డి, శ్రీనివాసులు, కొండయ్య, పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.