టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల నిఘా

ABN , First Publish Date - 2022-03-23T13:35:10+05:30 IST

తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు.

టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల నిఘా

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. నేడు ప్రసాదంపాడు  ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటి వద్ద భారీగా మోహరించారు. తెలుగు మహిళ నేత చెన్నుపాటి ఉషారాణి ఇంటివద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. పార్టీకి చెందిన నేతల ఇళ్ల వద్ద తెల్లవారుజాము నుంచి పోలీసులు మోహరించారు. 

Updated Date - 2022-03-23T13:35:10+05:30 IST