నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు రావడం దుర్మార్గం: టీడీపీ
ABN , First Publish Date - 2021-10-19T16:23:55+05:30 IST
మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటికి అర్దరాత్రి పోలీసులు రావడం దుర్మార్గమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు.
గుంటూరు: మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఇంటికి అర్దరాత్రి పోలీసులు రావడం దుర్మార్గమని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు అన్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు, అమ్మకాలు విచ్చల విడిగా సాగుతున్నాయని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ వైసీపీ నేతలకు ఊడిగం చేస్తోందన్నారు. సమస్యలు ఎత్తి చూపిన వారిపై బెదిరించే దోరణీ మంచిది కాదని హితవుపలికారు. కొంత మంది పోలీసుల వల్ల పోలీసు శాఖ పరువు పోతోందని పుల్లారావు, జీవీ ఆంజనేయులు అన్నారు.