Palnaduకు వెళ్లే టీడీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-06-04T16:02:11+05:30 IST
పల్నాడు జిల్లాకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
అమరావతి: పల్నాడు జిల్లాకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాలోని పిడుగు రాళ్ళు సమీపంలో పొందుగల వద్ద జీవీ ఆంజనేయులు, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.