రహదారులకు టీడీపీ నాయకుల మరమ్మతులు
ABN , First Publish Date - 2022-08-20T05:32:16+05:30 IST
వేగివాడ నడి బొడ్డున ఏలూరు– జంగారెడ్డిగూడెం ఆర్అండ్బి ప్రధాన రహదారిపై పడిన గోతులను పూడ్చే కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు శుక్రవారం ఉదయం చేపట్టారు.
పెదవేగి, ఆగస్టు 19: వేగివాడ నడి బొడ్డున ఏలూరు– జంగారెడ్డిగూడెం ఆర్అండ్బి ప్రధాన రహదారిపై పడిన గోతులను పూడ్చే కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు శుక్రవారం ఉదయం చేపట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొనకళ్ళ శివమణి సొంత నగదు రూ.30వేలకు పైగా వ్యయంతో గ్రావెల్, సిమెంట్, ఇసుకను కలిపి గోతులు పూడ్చారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్ మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్ళు దాటినా రహదారుల బాగోగులు పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదు రవికుమార్, తాళ్ళూరి శివాజీ, నెక్కలపూడి సురేష్బాబు, ఈడ్పుగంటి అనిల్, కందేపు వెంకట్రావు, ఆలపాటి బాలకృష్ణ, బొప్పన పండు పాల్గొన్నారు.