గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-01-27T18:15:01+05:30 IST
టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గవర్నర్ను కలిసింది. గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు.
అమరావతి: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గవర్నర్ విశ్వభూషణ్ను కలిసింది. గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్కు సమర్పించారు. చంద్రబాబుకు సమర్పించిన నివేదికను గవర్నర్కు అందజేశారు. గుడివాడ పర్యటనలో తమపై జరిగిన దాడి, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదు చేశారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా ఉన్నారు.