Repalleకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ.. నేతల House arrest..

ABN , First Publish Date - 2022-07-17T17:51:43+05:30 IST

మద్యం తాగి చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించాలని టీడీపీ పిలుపు ఇచ్చింది.

Repalleకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ.. నేతల House arrest..

గుంటూరు (Guntur) జిల్లా: మద్యం తాగి చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించాలని టీడీపీ (TDP) పిలుపు ఇచ్చింది. వాస్తవాలను తెలుసుకునేందుకు రేపల్లె (Repalle)కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ బయలుదేరనుంది. నేతలు నక్కా ఆనందబాబు, అశోక్‌బాబు, పట్టాభిరామ్, బుద్దా వెంకన్నలతో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం పోటుమెరకలో మద్యం తాగి ఇద్దరు మృతి చెందారు. మరణించినవారి కుటుంబాలను పరామర్శించేందుకు కమిటీ వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.


ఇటు రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే గుంటూరులో నక్కా ఆనందబాబును గృహనిర్బంధం చేశారు. రేపల్లెలో ఎటువంటి నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Updated Date - 2022-07-17T17:51:43+05:30 IST