‘చంద్రబాబు వస్తేనే పేదల జీవితాల్లో వెలుగు’

ABN , First Publish Date - 2022-01-17T05:16:36+05:30 IST

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు.

‘చంద్రబాబు వస్తేనే పేదల జీవితాల్లో వెలుగు’
మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 16: చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తేనే రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన టీడీపీ కుటుంబ సభ్యులకు రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు అండగా నిలవాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్యాపిలిలో హత్యకు గురైన బింగి శ్రీనివాసులును హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే నిర్బంధంలోకి తీసుకుని అధికార పార్టీ నేతల ఒత్తిళ్లను ఏమాత్రం పట్టించుకోకుండా కఠినంగా శిక్షించాలని గ్రామంలో ప్రశాంత వాతావరణం అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురైన బింగి శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు నాగేశ్వరరావు యాదవ్‌ ఈ సందర్భంగా రూ.5వేల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. గ్రామాల్లో వైసీపీ నాయకుల వల్ల ప్రశాంతత కనుమరుగవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బింగి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు తమకు అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను పోలీసులకు చెప్పినా కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించడం దారుణమన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో బింగి శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఇచ్చిన నిందితులను వెంటనే నిర్బంధంలోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డోన్‌ డీఎస్పీకి వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-01-17T05:16:36+05:30 IST