ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-04T06:02:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని టీడీపీ నాయకులు విమర్శించారు.

ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
వడ్డిగూడెంలో ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు

వీరవాసరం, జూలై 3: వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని టీడీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని వడ్డిగూడెంలో ఆది వారం బాదుడే బాదుడు పేరిట చార్జీల భారాన్ని ప్రజలకు వివరించారు. ఇంటింటికీ తిరిగి జనన్మోహాన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేకవిధానాలను ప్రచారం చేస్తూ కరపత్రాలను కార్యకర్తలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, సైదు మృత్యుంజయ, నేపాల చినతాతయ్య, కడలి వాసు, తదితరులు పాల్గొన్నారు.


ఆర్టీసీ చార్జీల పెంపు దారుణం


నరసాపురం టౌన్‌: ఆర్టీసీ చార్జీల పెంచడం దారుణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్‌ ప్రాంగణంలో టీడీపీ నాయకులతో కలిసి ఆదివారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T06:02:56+05:30 IST