నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2022-08-12T05:17:18+05:30 IST
వైసీపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు.
అత్తిలి, ఆగస్టు 11 : వైసీపీ ప్రభుత్వం పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. వరిఘేడులో గురువారం బాదుడే బాదు డు కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేసి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్లలో అభివృద్ధి పనులు జరగలేదన్నారు. రాబోయే కాలంలో ప్రజలందరూ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు బోడపాటి బుజ్జి, అడ్డాల సాయిబాబా, పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ దాసం బాబ్జి, అత్తిలి పట్టణ అధ్యక్షుడు పూతినీడి శ్రీనివాస్ పాల్గొన్నారు.