అంబేద్కర్నగర్లో నీటి ఎద్దడి నివారించండి
ABN , First Publish Date - 2022-09-28T04:35:47+05:30 IST
పట్టణంలోని 11వ వార్డు అంబేద్కర్ నగర్లో నెలకొన్న నీటి ఎద్దడిని తక్షణం నివారించాలని, లేకపోతే కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు.
కావలి, సెప్టెంబరు 27: పట్టణంలోని 11వ వార్డు అంబేద్కర్ నగర్లో నెలకొన్న నీటి ఎద్దడిని తక్షణం నివారించాలని, లేకపోతే కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం స్థానికులతో కలసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి డీఈ శ్రీనివాసరావుకి వినతిపత్రం అందచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్నగర్కు నీటిసరఫరా జరిగే అంబేద్కర్ బావికి ఏర్పాటు చేసిప మోటారు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం కొత్త మోటారు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే సమ్మర్ స్టోరేజి ట్యాంకు పైపు లైనును ఆ కాలనీకి కలపాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జ్యోతి బాబూరావు, బొట్లగుంట శ్రీహరినాయుడు, అక్కిలగుంట సూర్యప్రకాష్, ఇనగంటి అనిల్బాబు, పార్థసారధి, రవికుమార్, దర్శి సునీల్, తుమ్మల హరీష్, గొట్టిపాటి రాము, మండవ వెంకట్రావు, బత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.