వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలకు టీడీపీ నేతలు లొంగలేదు: శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-05-06T01:40:45+05:30 IST

వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలకు టీడీపీ నేతలు లొంగలేదు: శ్రీనివాసరావు

వైసీపీ అరాచకాలు, దుర్మార్గాలకు టీడీపీ నేతలు లొంగలేదు: శ్రీనివాసరావు

అమరావతి: వైసీపీకి దక్కిన దుగ్గిరాల ఎంపీపీ పదవి టీడీపీ పెట్టిన భిక్ష అని టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వైసీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలను కూడా నమ్మలేకపోయాడని మండిపడ్డారు. తన సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులపై నమ్మకం లేకే ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ ఎంపీటీసీ సభ్యులను ఎంపీపీ ఎన్నికకు దూరంగా ఉంచారని విమర్శించారు. అనైతిక చర్యలతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని వైసీపీ కైవసం చేసుకుందని, ఎంపీటీసీ ఎన్నికల నాటి నుంచి టీడీపీ నేతలపై ఎన్నో కక్ష పూర్తి చర్యలకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్పడ్డారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఎన్నో అరాచకాలు.. ఎన్నో దుర్మార్గాలకు వైసీపీ నేతలు పాల్పడ్డా, టీడీపీ నేతలు లొంగలేదన్నారు. బీసీ మైనార్టీకి చెందిన ముస్లిం మహిళకు ఎంపీపీ పదవి దక్కకుండా, ఎమ్మెల్యే ఆర్కే దుర్మార్గంగా వ్యవహరించారని ఆయన ధ్వజమెత్తారు. సొంత పార్టీ ఎంపీటీసీ సభ్యులను కూడా కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అని శ్రీనివాసరావు మండిపడ్డారు.


Read more