కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-06-20T03:19:16+05:30 IST
కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం వారి కుటుంబాలకైనా అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య పేర్కొన్నారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా
నెల్లూరు(వెంకటేశ్వరపురం), జూన్ 19: కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం వారి కుటుంబాలకైనా అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనాగేశ్వరావు, కప్పిర శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.