సాంబశివరావు మృతి పట్ల చంద్రబాబు, లోకేష్ సంతాపం
ABN , First Publish Date - 2022-02-02T17:02:23+05:30 IST
మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు.
అమరావతి: మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావు దెందులూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారన్నారు. సాంబశివరావు మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు. సాంబశివరావు మృతి తెలుగు దేశం పార్టీకి లోటని తెలిపారు. సాంబశివరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
లోకేష్ సంతాపం...
సాంబశివరావు మృతి పట్ల చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతాపం తెలియజేశారు. సాంబశివరావు మృతి బాధాకరమన్నారు. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి చిరస్మరణీయులుగా నిలిచారని కొనియాడారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు.