అశోక్ను ఏ2 విజయసాయిరెడ్డి విమర్శించడం హాస్యాస్పదం: అయ్యన్న
ABN , First Publish Date - 2021-12-24T23:17:16+05:30 IST
విశాఖ అశోక్గజపతిరాజుపై వైసీపీ నేతల దౌర్జన్యాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఖండించారు. ఉత్తరాంధ్రలో వందలాది ఆలయాలకు...
నర్సీపట్నం: విశాఖ అశోక్గజపతిరాజుపై వైసీపీ నేతల దౌర్జన్యాన్ని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఖండించారు. ఉత్తరాంధ్రలో వందలాది ఆలయాలకు అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ను వైసీపీ అవమానిస్తోందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతిరాజును చైర్మన్ పదవి నుంచి తొలగిస్తే హైకోర్టు తీర్పుతో తిరిగి కొనసాగుతున్నారని గుర్తు చేశారు. వేలాది ఎకరాలు ఆక్రమించిన ఏ2 విజయసాయిరెడ్డి.. అశోక్ను విమర్శించడం హాస్యాస్పదమని అయ్యన్నపాత్రుడు అన్నారు.