జెండాలు పంచి.. వరినాట్లు వేసి..

ABN , First Publish Date - 2022-08-14T05:16:03+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణం సమీపంలో ఉన్న పొలాల్లో రైతులు, కూలీలకు టీడీపీ నేతలు జాతీయ జెండాలు పంచి పెట్టారు.

జెండాలు పంచి.. వరినాట్లు వేసి..
రైతులతో కలిసి వరినాట్లు వేస్తున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి

  ఆజాది కా అమృత్‌ మహోత్సవాల్లో టీడీపీ నేతలు

 సాలూరు,ఆగస్టు13: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా శనివారం పట్టణం సమీపంలో ఉన్న పొలాల్లో రైతులు, కూలీలకు టీడీపీ నేతలు జాతీయ జెండాలు పంచి పెట్టారు.   ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి వారితో కలిసి సరదాగా వారినాట్లు వేశారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ...  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, నాయకులు అబ్దుల్‌, నాగరాజు కార్యకర్తలు, ఉన్నారు. 


Updated Date - 2022-08-14T05:16:03+05:30 IST