పెరిగిన ధరలతో పేదలకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-07-28T06:39:15+05:30 IST

పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత అన్నారు

పెరిగిన ధరలతో పేదలకు ఇబ్బందులు
గ్యాస్‌ సిలిండర్లకు పూలమాలలు వేసి వినూత్న రీతిలో నిరసన చేస్తున్న టీడీపీ మహిళ నేతలు

పెరిగిన ధరలతో పేదలకు ఇబ్బందులు 

గ్యాస్‌ సిలిండర్లకు పూలమాలలు వేసి శవయాత్ర

చిట్టినగర్‌, జూలై 27: పెరిగిన నిత్యావసర ధరలతో పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ టీడీపీ మహిళా అధ్యక్షురాలు సుకాశి సరిత అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెరిగిన నిత్యావసరల ధరలపై మంగళవారం కొత్తపేట టీడీపీ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. మహిళలు గ్యాస్‌ సిలిండర్లకు పూలమాలలు వేసి శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి పేదలపై చిత్తశుద్ధి ఉంటే తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పదివేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. చెన్నుపాటి ఉషారాణి, నాగెళ్ల నాగమణి, లలితాదేవి, పిళ్లా లోకేశ్వరి, పోతిన జ్వోతి, ముర్ని అపర్ణ, సత్యవతి, లోకేశ్వరి, శాంతిజ్వోతి, నాయకులు సారిపల్లి రాధాకృష్ణ, సుకాశికిరణ్‌కుమార్‌, సురభిబాలు, కె.శివ, షేక్‌ హాబీబ్‌, బూర కనకరావు, ఈది నాగేశ్వరరావు, రాళ్లపూడి మాధవ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-28T06:39:15+05:30 IST