రూ.50 వేల విరాళం ఇచ్చిన టీడీపీ నాయకుడు
ABN , First Publish Date - 2021-07-31T05:50:43+05:30 IST
కాల్వబుగ్గలోని సురభి గోశాలకు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి, టీజీవీ సంస్థల చైర్మన్ టీజీ భరత్ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.
కర్నూలు(అగ్రికల్చర్), జూలై 30: కాల్వబుగ్గలోని సురభి గోశాలకు టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జి, టీజీవీ సంస్థల చైర్మన్ టీజీ భరత్ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. శుక్రవారం కర్నూలులోని తన కార్యాలయంలో గోశాల నిర్వాహకులకు చెక్కును అందించారు. ఆగస్టు 4న గోశాలలో భరతమాత కలశ పూజను నిర్వాహకులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పూజలో పాల్గొనాలని గోశాల సభ్యులు టీజీ భరత్ను ఆహ్వానించారు. కార్యక్రమంలో గోశాల నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షులు మురళి చౌదరి, బాలగంగాధర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పోచా మహేశ్వరరెడ్డి, సెక్రటరీ శంకరయ్య, వాసవి సేవాదల్ గౌరవాధ్యక్షుడు శేషఫణి తదితరులు పాల్గొన్నారు.