చరిత్రలో “దళిత ద్రోహి”గా మిగిలిపోతారు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-01-05T00:39:48+05:30 IST

బ్రహ్మపురి పాఠశాల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే

చరిత్రలో “దళిత ద్రోహి”గా మిగిలిపోతారు: వర్ల రామయ్య

అమరావతి: బ్రహ్మపురి పాఠశాల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోతే మీరు( సీఎం జగన్) చరిత్రలో “దళిత ద్రోహి”గా మిగిలిపోతారని టీడీపీ నేత వర్ల రామయ్య హెచ్చరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం బ్రహ్మపురి పాఠశాలలో దళిత విద్యార్థులపై జరిగిన కులవివక్ష ఘటనపై  సీఎం జగన్‌‌కు వర్ల రామయ్య లేఖ రాశారు. దళిత వర్గాల విద్యార్థులను, అగ్రవర్గాల  విద్యార్థులను వేరు చేస్తూ కుల వివక్షత పాటించడం క్షమింపరాని నేరమన్నారు. బ్రహ్మపురి గ్రామంలో జరిగిన ఘటన మనువాద స్మృతులను గుర్తు చేస్తున్నాయన్నారు.


జిల్లా కలెక్టర్‌తో సహా పాలన యంత్రాగం కుల వివక్షతను, అంటరానితనాన్ని పాటించినట్లే  లెక్క అని ఆయన అభిప్రాయపడ్డారు. వారి చర్య చట్టరీత్యా శిక్షార్హమన్నారు.  సీఎం జగన్‌కి ఏ మాత్రం అంటరానితనాన్ని రూపుమాపాలన్న ఉద్దేశం ఉంటే వెంటనే ఈ ఘోరమైన ఘటనపై ఒక కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్ట వ్యతిరేక చర్యకు బాధ్యులైన క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతీ ఒక్కరినీ అరెస్టు చేసి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు.  

Updated Date - 2022-01-05T00:39:48+05:30 IST