సీఎస్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

ABN , First Publish Date - 2022-02-18T00:58:39+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ నేత

సీఎస్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. దళిత తహసీల్దార్‌పై కొడాలి నాని అనుచరుడు చేసిన దాడిని ఆ లేఖలో ప్రస్తావించారు. దళితులపై దాడులు, బెదిరింపులు, విధ్వంసాలు పెరిగిపోయాయన్నారు. సినిమా థియేటర్ ఓనర్‌కు ఎన్‌ఓసీ ఇవ్వనందుకు తహసీల్దార్‌పై మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, పోలీసుల సమక్షంలో దాడి చేశారని ఆయన ఆరోపించారు. మంత్రి కొడాలి నాని క్యాంప్ ఆఫీస్‌లో దాడి జరిగినందున పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని మంత్రి అనుచరులు బెదిరించారని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావుపై దాడిచేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని  ఆ లేఖలో సీఎస్‌ను ఆయన కోరారు. 

Updated Date - 2022-02-18T00:58:39+05:30 IST