ఈవేట ప్రభుత్వ అధికారులకు అగ్నిపరీక్ష: వర్ల

ABN , First Publish Date - 2020-10-19T14:22:57+05:30 IST

రాష్ట్రం ప్రభుత్వం, మంత్రులు, అధికారులపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈవేట ప్రభుత్వ అధికారులకు అగ్నిపరీక్ష: వర్ల

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు, అధికారులపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగం, గౌరవ సలహాదారులు, ముఖ్య నాయకులతో సహా, అందరూ, రిటైర్డ్ న్యాయమూర్తుల(జడ్జీల)వేటలో బిజీగా వున్నారు. "జడ్జీని పట్టు - స్టేట్మెంట్ ఇప్పించు" పథకంలో ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమయిoది. మంత్రులకు,  సీనియర్ ప్రభుత్వ అధికారులకు ఈ"వేట" అగ్నిపరీక్షగా మారింది’’ అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.



Updated Date - 2020-10-19T14:22:57+05:30 IST