సజ్జల ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తా: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-11-16T00:10:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక‌ృష్ణారెడ్డిపై టీడీపీ నేత

సజ్జల ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తా: వర్ల రామయ్య

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామక‌ృష్ణారెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అంతా తానై సజ్జలే నడిపిస్తున్నారని ఆరోపించారు. సజ్జల మరోసారి ప్రెస్‌మీట్ పెడితే హైకోర్టుకు వెళ్తాని ఆయన పేర్కొన్నారు. సలహాదారుగా ఉన్న సజ్జల అన్ని విషయాలు ఆయనే ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. మరోసారి సజ్జల ప్రెస్ మీట్ పెడితే.. సజ్జలే సీఎం అని రాష్ట్రమంతా తిరిగి చెబుతానని ఆయన పేర్కొన్నారు. సీఎంకు అవగాహన లేదని, సీఎంకు ఏమీ తెలియదని, సీఎంకు చదువు సంధ్యల్లేవని మూలన కూర్చొబెడతారా అని రామయ్య ప్రశ్నించారు. 


Updated Date - 2021-11-16T00:10:00+05:30 IST