ప్లీనరీలో పేలవంగా సీఎం ప్రసంగం: Varla

ABN , First Publish Date - 2022-07-08T19:22:11+05:30 IST

వైసీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం పేలవంగా ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

ప్లీనరీలో పేలవంగా సీఎం ప్రసంగం: Varla

అమరావతి: వైసీపీ ప్లీనరీ (YCP plenary)లో ముఖ్యమంత్రి జగన్ (Jagan) ప్రసంగం పేలవంగా ఉందని టీడీపీ(TDP) నేత వర్ల రామయ్య (Varla ramaiah) వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని మరచి, కేవలం ప్రతిపక్ష నేతను నిందించడానికే తన సమయాన్ని వెచ్చించారని మండిపడ్డారు. ప్రజా విశ్వాసo కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించకుండా, చంద్రబాబు(Chandrababu)ను దూషిస్తూ పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు ప్రస్థావించకుండా, ప్రజలను మభ్యపెట్టారన్నారు. ప్లీనరీలో ఇంకా సమయముంది కనుక, ప్రజా సమస్యలను ప్రస్థావిస్తూ, ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికను తెలియజేయవలసినదిగా గుర్తు చేస్తూన్నాను అంటూ వర్ల రామయ్య అన్నారు. 

Updated Date - 2022-07-08T19:22:11+05:30 IST