రైతులకు సంకెళ్లు వేయమన్నదెవరు?: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-10-30T17:28:17+05:30 IST

రైతులకు సంకెళ్లు వేయడంపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ తీరును టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ‘రాజధాని దళిత రైతులకు సీఎం పేషి నుంచి ఫోన్ వచ్చిన తర్వాతే పోలీసులు బేడీలు వేశారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై

రైతులకు సంకెళ్లు వేయమన్నదెవరు?: వర్ల రామయ్య

అమరావతి: రైతులకు సంకెళ్లు వేయడంపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ తీరును టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ‘రాజధాని దళిత రైతులకు సీఎం పేషి నుంచి ఫోన్ వచ్చిన తర్వాతే పోలీసులు బేడీలు వేశారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై సీఎం గానీ, సీఎం పేషి గానీ స్పందించలేదు. సీఎం మౌనం అంగీకారంగా తీసుకోవచ్చా? అమాయకులైన సిబ్బందిని సస్పెండ్ చేస్తే ఎలా? ఆదేశించిన పెద్దలపై సీఎం చర్యలు తీసుకోవాలి’ అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.



Updated Date - 2020-10-30T17:28:17+05:30 IST