ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలి: వర్ల
ABN , First Publish Date - 2020-06-03T18:57:17+05:30 IST
ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలి: వర్ల
అమరావతి: ప్రభుత్వం నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ఇన్ని సార్లు కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్ కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వం గురించి ఎవరేం అనుకుంటున్నారో సీఎం తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎం ఒళ్లు దగ్గర పెట్టుకొని చట్టబద్ధంగా వ్యవహరించాలని వర్ల రామయ్య తెలిపారు.