ఏడాదిలో ప్రభుత్వ విధానం గతి తప్పింది: వర్ల
ABN , First Publish Date - 2020-05-30T18:22:51+05:30 IST
ఏడాదిలో ప్రభుత్వ విధానం గతి తప్పింది: వర్ల
అమరావతి: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి గారు! ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ విధానం గతి తప్పింది. పాలనపై మీ పట్టు సడలింది. రతనాలు ప్రజలకు రాళ్లుగా కనిపిస్తున్నవి. న్యాయస్థానాల మొట్టి కాయలతో ప్రభుత్వం అచేతనమైనది. కరోనా కంట్రోలింగ్ అంతంత మాత్రమే. చివరకు, మీ పార్టీ పతాక కూడ సలహాదారులు ఎగరేసే స్తితికి చేరింది. హతవిధీ’’ అంటూ వర్ల రామయ్య పోస్ట్ చేశారు.