-
-
Home » Andhra Pradesh » TDP leader Vararamayya letter to Minister Peddireddy-MRGS-AndhraPradesh
-
మంత్రి Peddi reddyకి టీడీపీ నేత వర్లరామయ్య లేఖ
ABN , First Publish Date - 2022-05-14T13:44:26+05:30 IST
ఆరణి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ నేత వర్లరామయ్య లేఖ రాశారు.
అమరావతి: ఆరణి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy ramachandra reddy)కి టీడీపీ నేత వర్లరామయ్య (Vararamayya) లేఖ రాశారు. ఆరణి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలతో ఆర్థిక నష్టంతో పాటు సహజ వనరులపై ప్రభావం పడనుందని అన్నారు. ఇసుకను ఏపీ లారీలల్లో లోడ్ చేసి వే బిల్లులతో తమిళనాడులో స్థానిక ట్రక్కులకు మార్చి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఒకే వేబిల్లుపై అనేక మార్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు. స్థానిక వైసీపీ నేతల అండదండలతో ఇసుక అక్రమంగా తరలింపు జరుగుతోందని ఆరోపించారు. ఇసుక తవ్వకాలపై అధికారుల స్పందించకపోవడం దారుణమని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.